హాస్య కధలు
నేను పుట్టక క్రితం యెప్పుడొ డెభ్భై నాలుగో, డెభ్భై అయిదో సంవత్సరం లో పబ్లిష్ అయిన ఓ లావుపాటి పుస్తకం లోని ఓ కధ (అది కధో మరేమిటో బాగా గ్యాపకం లేదు) చదివాను.
నేనింకా స్కూల్లో చేరక ముందు మా నాన్నకి వుద్యోగం లో సస్పెండు చేశారు—యెందుకో. అమ్మకి వుద్యోగం వున్నా, నన్ను మా అమ్మమ్మగారింటికి పంపించారు. అక్కడే ఓ కాన్వెంట్ లో చేర్పించారు నన్ను. దాంతో మా చిన్న మామయ్య దగ్గర నాకు బాగా చనువు.
ఇప్పటికీ అటేపు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూంటాను.
ఆయన దగ్గర ఓ పెద్ద లైబ్రరీ లా బోళ్ళు పుస్తకాలు. అందులో పాత పత్రికలూ, సావనీర్లూ, సినిమా పాటల పుస్తకాలు, వెండితెర నవలలు ఇలా చాలా రకాలుండేవి.
అది ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక అనుకుంట. వ్రాసిన వారు మాత్రం యెర్రంసెట్టి శాయి. కధ పేరుకూడా గ్యాపకం లేదు. కధా గుర్తు లేదు. గుర్తున్నదల్లా ఒక్కటే.
ఆ గుర్తున్నదేమిటంటే.......
కధ ఆఖర్లో వాళ్ళ ఫ్రెండ్ సంతోషం పట్టలేక ఓ మాటంటాడు.
అది కూడా సరిగ్గా గ్యాపకం లేదు గాని, ఇలా వుంటుంది.
"జుహృద్జాక్లబ్యమ్మాక్కట్చత్తోయ్!"
ఇప్పటికీ అది తలుచుకుంటే భలే నవ్వు నాకు.
ఈ సారెప్పుడైనా మళ్ళీ ఆ పుస్తకం చూస్తే, ఆ మాట వెతికి పట్టుకుని రాస్తాను లెండి.

No comments:
Post a Comment